Thursday, April 25, 2024

స‌మాజ్ వాదీ పార్టీలో చేరిన దేశంలోనే అత్యంత పొడ‌వైన వ్య‌క్తి – హైట్ ఎంతో తెలుసా

స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు ధ‌ర్మేంద్ర ప్ర‌తాప్ సింగ్. ఈయ‌న దేశంలోనే అత్యంత‌పొడ‌వైన వ్య‌క్తి. యూపీకి చెందిన ధ‌ర్మేంద్ర ప్ర‌తాప్ సింగ్ ఎత్తు ఎనిమిది అడుగుల ఒక అంగుళం. 2.4మీట‌ర్లు. ఇత‌నిది ప్ర‌పంచ రికార్డుకంటే 11సెంటీమీట‌ర్లు త‌క్కువ‌. కాగా అఖిలేశ్ యాద‌వ్ నాయ‌క‌త్వం, ఎస్పీ పార్టీ విధానాలు న‌చ్చ‌డంతో ప్ర‌తాప్ సింగ్ త‌మ పార్టీలో చేరార‌ని అధికార ప్ర‌తినిధి రాజేంద్ర చౌద‌రి వెల్ల‌డించారు. అత‌ని రాక‌తో పార్టీ మ‌రింత బ‌లం పుంజుకుంటుంద‌ని చెప్పారు. చాలా పొడవు ఉండడంతో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ చెప్పారు. పొడవు ఎక్కువ ఉండడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని, వివాహం చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదన్నారు. అయితే, ఈ పొడవు కారణంగా తాను సెలబ్రిటీ అయిపోయినట్టు.. ప్రజలు తనతో ఫొటో తీసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement