Friday, March 29, 2024

Vizag: వీడిన వివాహిత సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీ

విశాఖపట్నం మిస్సింగ్ అయిన వివాహిత సాయిప్రియ మిస్టరీ వీడింది. సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు. భర్త ఫోన్ చూస్తున్న సమయంలో ప్రియుడు రవితో పరారైంది. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయిప్రియ సోమవారం ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకి ఫోన్ లో మెసేజ్ రావడంతో వెనక్కొచ్చి మెసేజ్ చూసుకొని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు.

బీచ్ లో కెరటాలకు కొట్టుకుపోయిందని భావించి పోలీసులకు పిర్యాదు చేశారు. భార్య కొట్టుకుపోవడం తాను చూడలేదని భర్త శ్రీనివాసు అంటున్నారు. మెసేజ్ చూసి వచ్చే సరికి సాయి ప్రియ కనబడలేదని చెబతున్నారు. గజ ఈతగాళ్ళు సాయంతో బీచ్ లో గాలించగా ఆచుకీ లభ్యం కాలేదు. చివరకు సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement