Wednesday, April 24, 2024

ట్వీట్ చేసిన లిటిల్ మాస్టర్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరారు. సచిన్‌కు మార్చి 27న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అప్పటినుంచి స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చింది. అప్పటి నుంచీ హోమ్‌లో ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. కానీ డాక్టర్ల సలహా మేరకు ఇవాళ ఆయన ఆస్పత్రిలో చేశారు. కరోనా నిర్థారణ అయిన ఆరు రోజులకు సచిన్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. “వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు సచిన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆసుపత్రి నుంచి కోలుకున్న వెంటనే తిరిగి వస్తాను. నాకోసం ప్రార్థించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక 2011 ప్రపంచ కప్ 10వ వార్షికోత్సవం సందర్భంగా భారతీయులందరికీ, నా తోటి ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు.” అని ట్వీట్ చేశారు సచిన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement