Friday, March 29, 2024

Jadcherla: కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురికి తీవ్ర గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జడ్చర్ల పరిధిలోని చిట్టి బోయిన్‌పల్లి గ్రామ సమీపంలో గురువారం  తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. బస్సు డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement