Tuesday, March 26, 2024

West Godavari: ప్రైవేట్ బస్సులో రూ.4.76 కోట్లు స్వాధీనం

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో రూ.4.76కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. త‌నిఖీల్లో భాగంగా.. ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.4.76 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం-గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. బస్సు డ్రైవర్, క్లీనర్‌ తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్‌లో తరలిస్తుండగా.. నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి తీసుకెళ్తున్నారు. ఆ డ‌బ్బు ఎవ‌రిది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement