Thursday, April 18, 2024

Breaking | హైదరాబాద్​ ఈడీ ఆఫీసర్​గా రోహిత్​ ఆనంద్​.. దినేష్​ పరుచూరి కొచ్చికి బదిలీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ అదనపు డైరెక్టర్‌‌గా ఉన్న ఐఆర్ఎస్ అధికారి దినేష్ పరుచూరి బదిలీ అయ్యారు. ఆయన తెలంగాణ, ఏపీ పరిధితో కూడిన ఈడీ డైరెక్టరేట్ హైదరాబాద్ జోన్‌కు బాధ్యతలు చూసేవారు. ప్రస్తుతం ఆయన ప్లేసులో రోహిత్​ ఆనంద్​ రానున్నారు. ఇక.. దినేష్​ పరుచూరిని కొచ్చికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐఆర్ఎస్ 2009 బ్యాచ్ అధికారి అయిన దినేష్.. జులై 31న డిప్యూటేషన్ పై ఈడీలో చేరారు. గతంలో ఆయన ఆదాయపుపన్ను శాఖ, ఏపీ ట్రాన్స్‌కోలో పనిచేశారు.

దినేష్ పరుచూరి ఎవరు..?
గ‌తంలో ఏపీ, తెలంగాణ ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ రిజ‌న‌ల్ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు దినేష్ పరుచూరి. ఇప్పుడు ఎన్‌ ఫోర్స్‌మెంట్ ఆడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌తలు నిర్వర్తిస్తున్నారు. 2009 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ దినేష్ పరుచూరి 31జులై 2022న డిప్యూటేషన్ ప్రాతిపదికన అదనపు డైరెక్టర్‌గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోకి వచ్చి చేరారు. ఈ నియామకం 4 సంవత్సరాల కాలానికి ఉంటుంది. అంతకుముందు TRANSCO ట్రాన్స్‌కో జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో దినేష్ పరుచూరి పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement