Friday, April 19, 2024

నసుల్లాబాద్ నుండి ప్రారంభమైన రేవంత్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర నసుల్లాబాదు నుండి ప్రారంభమైంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాదయాత్ర విజయవంతంగా సాగుతుంది. బాన్సువాడ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, బాన్సువాడ నియోజకవర్గం కాసుల బాలరాజ్, నసుల్లాబాద్ మండల అధ్యక్షులు నందు పటేల్, స్థానిక గ్రామ సర్పంచ్ సాయిలు, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మండల మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement