Friday, April 26, 2024

చర్చనీయాంశమైన రేవంత్ ట్వీట్!

మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి జగదీశ్ రెడ్డిపై ఓ ఆంగ్ల పత్రికా రాసిన  కథనాన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన రేవంత్.. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…? అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం వేడి చల్లారక ముందే.. టీఆర్ఎస్ పార్టీకి మరో తలనొప్పి మొదలైనట్లు తెలుస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డికి సంబంధించి ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనం రాజకీయంగా సంచలనం అయ్యింది. గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరిపారని ఆంగ్ల పత్రిక కథనం తెలిపింది. ఈ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని, పేరుకు పుట్టిన రోజు వేడుకలైనా.. అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచ్చినట్టుగా ఈ కథనం పేర్కొంది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్‌ను సీఎం చేయడం, ఈటల కొత్త పార్టీ  తదితర అంశాలపైనే చర్చించినట్టుగా కథనాన్ని రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement