Saturday, April 20, 2024

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్.. దొంగల్లా కనిపిస్తున్నారా?అంటూ రేవంత్ ఫైర్

నిజమాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 317 జీవో కారణంగా మనస్థాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్న భీంగల్ కు చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లారు. దాంతో జీవన్ రెడ్డి కారును పోలీసులు ఛేజ్ చేసి కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని, ఆయనను అరెస్ట్ చేశారు.

ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్‎కు దొంగల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం నేరమా ? అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రతిపక్ష నేతలు ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కని చెప్పారు. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతుందని, మూల్యం తప్పక చల్లించుకుంటారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement