Tuesday, April 23, 2024

Revanth reddy: కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకో

ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రభుతం ఒక నిర్ణయం తీసుకోవాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 24 గంటలలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలును ప్రారంభించాన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని రైతులకు భరోసా కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టిఆర్ఎస్ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు  చేపట్టాలని కోరారు. రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, టిఆర్ఎస్ లు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement