రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీని నెరవేర్చాలని సీఎం కేసీఆర్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఛాలెంజ్ లు చేయడం, డిబేట్స్ నుంచి పారిపోవడం వంటివి కాకుండా… రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి కేటీఆర్ ని ఉద్దేశించి అన్నారు. 2017 ఏప్రిల్ 13న రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోయిందని… కానీ చాలా తేలికగా, పూర్తిగా ఆ హామీని మర్చిపోయారని మండిపడ్డారు. రైతుల కోసం ఆ హామీని నెరవేర్చాలని కేటీఆర్ ను డిమాండ్ చేస్తున్నానని రేవంత్ పేర్కొన్నారు.
కాగా, నిన్న మంత్రి కేటీఆర్ ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో డిబేట్లో పాల్గొనాలని కోరాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘క్రిమినల్స్తో డిబేట్లో పాల్గొననని సమాధానం ఇచ్చారు’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.