Thursday, March 28, 2024

Rachabanda : రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మల్లు రవికి స్వల్ప గాయాలు

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగనే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. భారీ బందోబస్తు నడుమ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నిన్న రాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఎర్రవల్లిలోని తలపెట్టిన రచ్చబండకు బయలుదేరారు. అయితే, బలవంతంగా రేవంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

జూబ్లీహిల్స్ వద్ద అరెస్ట్ సందర్బంగా పెద్దఎత్తున తోపులాట జరిగింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని పోలీసులు తోసివేయడంతో ఆయన కింద పడడ్డారు. దీంతో మల్లు రవికి స్వల్ప గాయాలు అయ్యాయి.  పోలీసుల దురుసు ప్రవర్తనతో మల్లు రవి చొక్క చినిగిపోయింది. ఈ క్రమంలో మల్లు రవిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital
Advertisement

తాజా వార్తలు

Advertisement