Thursday, March 28, 2024

హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టుకు నివేదిక..

హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టుకు నివేదిక అందింది. ఈ మేరకు విచారణ కమిటీ సీల్డ్ కవర్ లో నివేదికను సమర్పించింది. కాగా ఈనెల 12వ తేదీన అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే అదానీ గ్రూప్స్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక తరువాత స్టాక్ మార్కెట్ లో ఆ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా స్టాక్ మార్కెట్ లలో అదానీ గ్రూప్ పై పెట్టుబడులు పెట్టిన వేలాది మంది రూ.లక్షల కోట్లు నష్టాన్ని చవి చూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement