Thursday, April 25, 2024

పసిడితో మిర్చి ధర పోటీ.. ఎర్ర బంగారానికి ఆల్ టైమ్ రికార్డు ధర

తెలంగాణలో ఎర్ర బంగారం ధర పసిడితో పోటీ పడుతుంది. గత కొన్ని వారాలుగా క్రమంగా పెరుగుతున్న బంగారం ధరకు పోటీగా ఎండు మిర్చి పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశి రకం మిర్చికి ఈరోజు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 45,000గా పలికింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు లింగేశ్వరరావు 24 బస్తాల దేశి రకం మిర్చితో మార్కెట్‌కు తెచ్చాడు. లోకేశ్వర కంపెనీ ఖరీదుదారులు దీనికి రూ. 45,000 నిర్ణయించారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఇదే మార్కెట్లో దేశి రకం మిర్చికి ధర రూ.44,000 పలికింది. ఈరోజు దీని ధర రూ. 45 వేలకు చేరడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement