దేశంలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 4,187 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వరుసగా మూడో రోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 4,01,078 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. నిన్న 3,18,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరగా.. మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 37,23,446 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు. శుక్రవారం 22 లక్షల 97 వేల 257 మందికి టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement