Friday, April 26, 2024

125వ రోజుకి చేరుకున్న.. రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌

నేటితో 125వ రోజుకి చేరుకుంది భార‌త్ జోడో యాత్ర‌. గతేడాది సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది ఈ యాత్ర‌.కాగా శుక్రవారం జమ్ములోని కతువాలో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ తన నడకను కొనసాగిస్తున్నారు. శివసేనకు (ఉద్ధవ్‌ థాక్రే వర్గం) చెందిన సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌.. రాహుల్‌తో కలిసి నడిచారు. జమ్ముకశ్మీర్‌లో 10 రోజులపాటు కొనసాగి ఈ నెల 30తో ఈ యాత్ర ముగియనుంది. గురువారం సాయంత్రం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ మీదుగా ఆయన జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement