Friday, March 29, 2024

RBI Rules: డెబిట్‌, క్రెడిట్ కార్డుల రక్షణకు కొత్త రూల్స్‌.. అక్టోబ‌ర్ నుంచి అమ‌లు చేయ‌నున్న ఆర్‌బీఐ

బ్యాంకు అకౌంట్​ హోల్డర్లను ఆర్థిక మోసాల నుంచి రక్షించడానికి ఆర్బీఐ కొత్త రూల్స్​ని తీసుకొస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సేఫ్​గా ఉంచేందుకు కార్డు టోకనైజేషన్ చేస్తోంది. ఈ నియమం ప్రకారం కార్డ్ హోల్డర్లు తమ కార్డును టోకెన్‌గా మార్చుకోవాలి. ఇప్పుడు వ్యాపారి, చెల్లింపు గేట్‌వే కంపెనీ కార్డ్ చెల్లింపు సమయంలో మీ డేటా, కార్డ్ వివరాలు సేవ్ చేయలేరు. బదులుగా వారు టోకెన్ వివరాలను సేవ్ చేస్తారు. అయితే వాటిని మీరే సృష్టించుకుంటారు. దీనికి సంబంధించిన తేదీని ఆర్బీఐ ఖరారు చేసింది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్ ప్రకారం ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇక మీద‌ట కార్డ్ ద్వారా చెల్లిస్తే కార్డ్ వివరాలను టోకెన్‌తో భర్తీ చేయాలి. ఈ నియమాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ముందుగా కార్డ్ టోకనైజేషన్ విధానం ఏంటో తెలుసుకుందాం.

మీరు ఎక్కడైనా కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేసినప్పుడు ఆ వ్యాపారి ప్లాట్‌ఫారమ్ మీ కార్డ్ నంబర్, మీ CVV, గడువు తేదీ మొదలైన కార్డ్ వివరాలను సులభంగా, వేగవంతమైన చెల్లింపు అనుభవం కోసం డేటాబేస్‌లో స్టోర్ చేయాల్సి వ‌స్తుంది. ఇది ఇప్పటి వరకు జరిగే పద్దతి. కానీ, భద్రతపరంగా ఇది సురక్షితమైనది కాదు. ఆ వెబ్‌సైట్ / ప్లాట్‌ఫారమ్ / వ్యాపారి డేటా హ్యాక్ చేస్తే మీ డేటా కూడా లీక్ అయ్యే చాన్సెస్‌ ఉంటాయి. అందుకే కార్డ్ టోకనైజేషన్ ఆప్షన్‌ను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది.

ఈ నియమం ప్రకారం.. ఇక మీద‌ట‌ కార్డ్ చెల్లింపు చేసినప్పుడు టోకెన్‌ను రూపొందించాలి. అప్పుడు వ్యాపారి మీ కార్డ్ వివరాలను సేవ్ చేసే చాన్సెస్ ఉండ‌వు. టోకెన్ వివరాలు మాత్రమే వ్యాపారికి వెళ్తాయి. RBI రూల్స్ ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ తర్వాత కార్డ్ హోల్డర్ల వివరాలను బ్యాంక్ లేదా కార్డ్ జారీ చేసే సంస్థ/నెట్‌వర్క్ తప్ప మరెవరూ సేవ్ చేయలేరు. దీనికి ముందు వినియోగదారులు టోకెన్‌తో కార్డ్ వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ కార్డును సురక్షితంగా ఉంచే బాధ్యత బ్యాంకులు, కార్డుదారులపైనే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement