Wednesday, April 24, 2024

Shame | మానసిక విక‌లాంగురాలిపై అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి..

ఎల్లారెడ్డి, (ప్రభ న్యూస్): మానసికంగా, శారీరకంగా (ఫిజికల్) స‌రిగాలేని ఓ అమ్మాయికి కూల్ డ్రింక్‌లో మద్యం, మ‌త్తు మందు కలిపి ఇచ్చి ఆ త‌ర్వాత అత్యాచారం చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన విష‌యం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆలస్యంగా వెల్ల‌డ‌య్యింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువ‌తి మానసికంగా, శారీరకంగా (ఫిజికల్) స‌రిగా లేదు. ఆమెపై గ‌త నెల 26వ తేదీన ఇంటి పక్కనే ఉన్న దత్తు (51) మధ్యాహ్నం వేళ దారుణానికి పాల్ప‌డ్డాడు. కూల్ డ్రింక్‌లో మద్యం, మ‌త్తు మందు కలిపి ఇచ్చి రేప్ చేసిన‌ట్టు పోలీసులకు బాధితురాలి త‌ల్లిదండ్రులు కంప్లెయింట్ చేశారు.

అయితే.. గ‌త నెల 27వ తేదీన బాధితురాలి త‌ల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్ళారు. దీంతో కడుపు నొప్పి వస్తుందని బాధితురాలు చెప్ప‌డంతో బాన్స్ వాడలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో వైద్య పరీక్షలు చేయించారు. మెడిక‌ల్ టెస్టుల అనంత‌రం అక్కడి డాక్ట‌ర్లు ఆమెపై అత్యాచారం జరిగిందని చెప్పారు. బాధితురాలు కోలుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఆరా తీయగా వారి ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఈ దారుణానికి పాల్ప‌డ్డ‌ట్టు తెలిపింది. అయితే.. ఆ కుటుంబంలో చ‌దువుకున్న వారు లేకపోవడం, పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం అయ్యింది. బాధితురాలు తల్లి ఇవ్వాల (శుక్ర‌వారం) ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేయ‌నున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement