Tuesday, April 16, 2024

16 నెలల కూతురిపై రేప్, మర్డర్.. ఆ పనికి సహకరించిన కన్నతల్లి

ఒక పసికందుపై కన్న తండ్రే దారుణానికి పాల్పడ్డాడు. ముక్కుపచ్చలారని కూతురిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా గొంతు నులిమి చంపేశాడు. 16 నెలల చిన్నారిపై ఈ అఘాయిత్యం జరిగింది. ఇక ఈ ఘాతుకానికి ఆ పసికందు తల్లి కూడా సహకరించింది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ చిన్నారి డెడ్ బాడీని సొంతూరికి తీసుకెళ్లాలని రైలు ఎక్కారు. ట్రైన్‌లో ప్రయాణికులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఈ  విషయం బయటికి తెలిసింది. నిందితులు 16 నెలల పసికందు మృతదేహాన్ని తీసుకుని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు రైలులో బయల్దేరారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన దంపతులు సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కన్నకూతురిపై 26 ఏళ్ల తండ్రి ఈ నెల 3 వ తేదీన ఇంట్లో లైంగిక దాడికి పాల్పడి దారుణంగా చంపేశాడు. ఈ ఘోరం తల్లి ఎదుటే జరిగినా.. ఆమె కూడా ఇందుకు సహకరించింది. 

తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ డెడ్ బాడీని రాజ్‌కోట్‌కు తీసుళ్లాలని స్కెచ్ వేసుకున్నారు. సికింద్రాబాద్‌లో రాజ్‌కోట్‌కు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కారు. అయితే.. పాపలో చలనం లేకపోవడం, ఆ దంపతులు ఇద్దరూ అనుమాపాస్పదంగా ఉండడంతో తోటి ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటేనే ఈ విషయాన్ని టీటీఈకి ఇన్ ఫాం చేశారు. దీంతో ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా, వారిని రైలు నుంచి షోలాపూర్‌లో దింపేశారు. నిందితులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement