Tuesday, April 23, 2024

రామ్ చ‌ర‌ణ్ కోసం 264కి.మీ న‌డిచిన ఫ్యాన్ – బియ్యం గింజ‌ల‌తో చ‌ర‌ణ్ బొమ్మ‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమాని చేసిన ప‌ని ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. చ‌ర‌ణ్ ని చూసేందుకు ఏకంగా 264కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్ళాడు జైరాజ్ అనే వ్య‌క్తి.అంతేకాదు తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడా వ్యక్తి. తెలంగాణలోని గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి.. రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని బియ్యపు గింజలతో ఇలా చాటుకున్నాడు. ఆ బొమ్మలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్ ను చేరాడు. చరణ్ నివాసంలో ఆయన్ను కలిసి బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. ఆ అభిమానాన్ని ఆర్ట్ ను చూసి చరణ్ మురిసిపోయాడు. డై హార్డ్ ఫ్యాన్స్ ఇలానే ఉంటారు మ‌రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement