Tuesday, April 16, 2024

కృష్ణంరాజు ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన రాజ్ నాథ్ సింగ్ – ప్ర‌భాస్ కి థైర్యం చెప్పిన కేంద్ర మంత్రి

అనారోగ్య సమస్యలో చికిత్స పొందుతూ న‌టుడు..బిజెపి నేత‌ కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులు, ప్రభాస్ తో రాజ్ నాథ్ కొంత సేపు మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల తన సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బీజేపీ నేతలు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వివరించారు. థైర్యంగా ఉండాల‌ని ప్ర‌భాస్ కి చెప్పారు కేంద్ర మంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement