Wednesday, April 24, 2024

Breaking: భార‌త ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్ కుమార్‌

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ)గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ఇవ్వాల (ఆదివారం) బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇప్ప‌టిదాకా కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగిన ఆయ‌న‌ను ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు రాజీవ్ కుమార్ సీఈసీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మొన్న‌టిదాకా సీఈసీగా కొన‌సాగిన సుశీల్ చంద్ర నిన్న (శ‌నివారం) ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. సుశీల్ ప‌ద‌వీ విర‌మ‌ణ‌తో ఖాళీ అయిన సీఈసీ పోస్టులో రాజీవ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2025 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఈ ప‌ద‌విలో ఆయ‌న కొన‌సాగ‌నున్నారు. 2024లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ను కూడా రాజీవ్‌కుమార్ నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement