Thursday, April 25, 2024

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ను తాకిన వరదనీరు

తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ కార్యాలయాలు వదర నీటిలో మునిగిపోతున్నాయి. ఇటీవల sతెలంగాణ సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ భవనం వరదల కారణంగా నీటమునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవనం చుట్టూ వరద నీరు చేరింది. ఇటీవలే కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ లోకి వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. కాగా, జులై 4న సిరిసిల్లలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement