Thursday, April 25, 2024

ఆగి ఉన్న రైలులో మంటలు.. ఎవరికీ ప్రమాదం జరగలేదన్న రైల్వే.. హైలెవల్​ దర్యాప్తునకు ఆదేశం

బిహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ రోజు ఉదయం 9.13 గంటలకు రైలులో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి పొగ వ్యాపించింది. అప్రమత్తమైన సిబ్బంది 9.50 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పివేశారు. జైనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ఐదు కోచ్‌లలో మంటలు చెలరేగినట్లు తొలుత వార్తలు వచ్చినా… రైల్వే తెలిపిన అధికారిక ప్రకటన ప్రకారం రైలులోని ఒక కోచ్‌లో మాత్రమే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

‘‘ఫైర్​ జరిగినట్టు సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనను గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. దీనిని రైల్వే అడ్మినిస్ట్రేషన్ చాలా తీవ్రంగా పరిగణించింది. ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నాం’’ అని ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే తన ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement