Friday, April 19, 2024

ప్ర‌యాణికుడిపై దాడి చేసిన రైల్వే టీసీలు.. స‌స్పెండ్ చేసిన అధికారులు

రైల్లో ప్ర‌యాణిస్తున్న ఓ ప్ర‌యాణికుడిపై దాడికి దిగారు ఇద్ద‌రు టీసీలు. పైబెర్తులో కూర్చున్న ఆ వ్యక్తిని కిందకు లాగి మరీ చితకొట్టారు. ఓ వ్యక్తి రైల్లో పైన ఉన్న సీట్లో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీసీకి, సదరు ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీసీ తోటి టీసీతో కలిసి ప్రయాణికుడి కాలు పట్టుకుని బలవంతంగా కిందకు లాగుతారు. అనంతరం ఇద్దరూ కలిసి అతన్ని కాళ్లతో తంతూ తీవ్రంగా కొడతారు.

టీసీల దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌ అయ్యి రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. ఘటనపై స్పందించిన ఓ అధికారి.. ఇద్దరు టీసీలను సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ముంబయి నుంచి జైనగర్ వెళ్తున్న రైల్లో దోలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement