Thursday, April 18, 2024

రాధేశ్యామ్ కి రూ. 400కోట్ల ఆఫ‌ర్ – ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకుంటారా !

పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కు సిద్ధ‌మ‌యింది రాధేశ్యామ్ చిత్రం. ఈ చిత్రం రిలీజ్ పై రూమ‌ర్ ఒక‌టి న‌డుస్తుంది. రాధేశ్యామ్ కు ఒక పెద్ద ఓటీటీ సంస్థ రూ.400కోట్ల ఆఫ‌ర్ తో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ కి ఆఫ‌ర్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం ప్రారంభం అయి మూడేళ్లు గ‌డుస్తుంది. రాధేశ్యామ్ చిత్రం విష‌యంలో హీరో ప్ర‌భాస్ విసిపోయాడు కూడా. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కింది రాధేశ్యామ్. టి సిరీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈమూవీలో స్టార్ కాస్ట్ నటించారు. రోమన్ కాలం నాటి పాత ప్రేమ కథతో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా రోమన్ కాలం నాటి సెట్స్ ను వేశారు మేకర్స్. రాధేశ్యామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో రలీజ్ కు రెడీ అయ్యింది రాధేశ్యామ్. ఎలాగైనా ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. దాదాపు 300 కోట్ట బడ్జెట్ తో తెరకెకిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాని 400 కోట్ల ఆఫర్ వస్తే.. ఓటీటీ రిలీజ్ కు టీమ్ ఒప్పుకుంటారా.. గతంలో అక్షయ్ కుమార్ లక్ష్మీ మూవీ కూడా ఇలానే భారీ ఆఫర్ కు ఓటీటీ రిలీజ్ చేశారు. కాని వర్కౌట్ కాలేదు. మరి ఇంత భారీ సినిమా ఓటీటీ రిలీజ్ చేస్తే వర్క్ అవుట్ అవుతుందా అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. చూడాలి మ‌రి ఏమ‌వుతుందో.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement