Tuesday, April 23, 2024

ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.300కోట్లు రాబ‌ట్టిన ‘పుష్ప‌’

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించ‌గా, న‌టి స‌మంత ఐటెంసాంగ్ లో మెరిసింది. పుష్ప కి బాక్సాఫీసు వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్ లో చేరింది. కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 300కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. కాగా ఈ ఏడాది అత్య‌ధిక కలెక్షన్స్ సాధించిన తొలి మూవీగా ‘పుష్ప ది రైజ్’ నిలిచింది.అయితే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్లో థియేటర్లు ఎక్కువగా మూతవేయడం సహా కొన్ని చోట్ల 50 శాతం సామర్థ్యంతో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప’ హిందీ వర్షెన్ కు రూ.56 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం సరికొత్త రికార్డు అని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement