Tuesday, April 23, 2024

Punjab: భ‌ద్రతా లోపం : రాహుల్ గాంధీ కారు పైకి జెండా విసిరిన యువ‌కుడు

జనవరి 5న పంజాబ్​ ఫిరోజ్​పుర్​లో ర్యాలీ హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని మోదీ పర్యటనలోనూ భద్రతా లోపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన కాన్వాయ్​ వెళ్లే రోడ్డును నిరసనకారులు దిగ్భందించారు. దీంతో 20 నిమిషాల పాటు మోదీ కారులోనే ఉండిపోయారు. అనంతరం ర్యాలీకి వెళ్లకుండా ఢిల్లీకి తిరుగుముఖం పట్టారు.


అయితే తాజాగా… కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ పంజాబ్​ పర్యటనలో భ‌ద్ర‌తా లోపం క‌నిపించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భద్రతా లోపం అధికారులను షాక్​కు గురిచేసింది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపైకి ఓ యువకుడు జెండా విసిరేశాడు. ఆదివారం పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు రాహుల్​ లుధియానా వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ హల్వారా నుంచి లుధియానాలో హయత్​ రిజెన్సీ హోటల్​కు వెళ్లే క్రమంలో హర్షిలా రిసార్ట్ చేరుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దీంతో కారు అద్దాలు తీసి రాహుల్ అభివాదం చేశారు.

ఈ సమయంలోనే ఓ వ్యక్తి జెండాను రాహుల్​ కారుపైకి విసిరాడు. రాహుల్ వెంటనే కిటికీ అద్దాలు మూసేశారు. ఈ సమయంలో రాహుల్​ ప్రయాణిస్తున్న కారును కాంగ్రెస్​ సీనియర్​ నేత సునీల్​ జఖార్ డ్రైవ్​ చేస్తున్నారు. నవ్​జ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్​జీత్​ సింగ్ చన్నీ కూడా కారులోనే ఉన్నారు. ఈ ఘటనను చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. జెండా విసిరిన యువకుడు ఎన్ఎస్​యూఐ కార్యకర్త అని, అతడు జమ్ముకశ్మీర్​కు చెందిన వాడని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement