Friday, March 29, 2024

Telangana | సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ భేటీ.. రాజ‌కీయాంశాల‌పై చ‌ర్చ‌

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ఇవ్వాల సాయంత్రం భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో దేశంలోని ప్ర‌స్తుత రాజ‌కీయాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ప‌లు కార్య‌క్ర‌మాల నిమిత్తం ఇవ్వాల మ‌ధ్యాహ్నం సీఎం భ‌గ‌వంత్ మాన్ హైద‌రాబాద్ సిటీకి వ‌చ్చారు. ఇక‌.. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇటీవ‌లే ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆరోజు నుంచి ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ఆయా పార్టీల నాయ‌కులు, రైతు సంఘాల నేత‌లు కేసీఆర్‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు, ఇత‌ర అంశాల‌పై పార్టీ అధినేత కేసీఆర్‌తో చ‌ర్చిస్తున్నారు. బీజేపీపై పోరాటం విష‌యంలో కేసీఆర్‌కు ప‌లువురు నేత‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

24న పంజాబ్‌ స్పీకర్‌ రాక
పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌సింగ్‌ సంధ్వాన్‌ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్‌ జైకిషన్‌ సింగ్‌ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్‌ సింగ్‌ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్‌ సింగ్‌ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement