Saturday, April 20, 2024

పుంగ‌నూరు జాతి ఆవుని రూ. 4.10ల‌క్ష‌ల‌కి కొనుగోలు చేసిన – బాబా రాందేవ్

ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్ పుంగ‌నూరు జాతి ఆవుని రూ.4.10ల‌క్ష‌ల‌కి కొనుగోలు చేశారు. ఈ జాతి ఆవులు ఎక్కువ‌గా చిత్తూరు జిల్లాలో క‌నిపిస్తాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ పశుపోషకుడి దగ్గరనున్న ఉన్న ఆ ఆవు ఏకంగా రూ. 4.10 లక్షలకు అమ్ముడుపోయింది. మూడున్నర సంవత్సరాల వయసున్న ఈ ఆవు ఎత్తు 30 అంగుళాలు మాత్రమే.హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమం నుంచి తెనాలి వచ్చిన ప్రతినిధులు పశుపోషకుడు కంచర్ల శివకుమార్‌ను కలిసి ఆవును కొనుగోలు చేశారు. అంతకుముందు దానికి పశువైద్యాధికారి నాగిరెడ్డి వద్ద పరీక్షలు చేయించారు. అనంతరం దానిని వారు తీసుకెళ్లారు. ప్రత్యేకమైన ఈ జాతి పెంపకానికి అనువుగా ఉంటుందని బాబా రాందేవ్ ఆశ్రమ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement