Friday, March 29, 2024

Breaking: హైకోర్టు ఆదేశాలు పాటించ‌ని ప‌బ్‌లు.. సౌండ్ పెంచిన‌ రెండు ప‌బ్‌ల‌పై కేసు

ప‌ది గంట‌లు దాటిన త‌ర్వాత సౌండ్ పెట్టొద్ద‌న్న‌ హైకోర్టు ఆదేశాల‌ను హైద‌రాబాద్ సిటీలోని కొన్ని ప‌బ్‌లు పాటించ‌డం లేదు. దీంతో పోలీసులు రూల్స్ మీరి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌బ్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ మేర‌కు ఇవ్వాల (ఆదివారం) సిటీలోని రెండు ప‌బ్‌ల‌పై కేసు న‌మోదు చేశారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 36లో ఉన్న క్ల‌బ్ రోగ్‌పై, జూబ్లీహిల్స్​లోని రిపీట్ అండ్ రివోల్ట్ ప‌బ్‌పై కేసు న‌మోదు అయ్యింది. ఇక మిగ‌తా ప‌బ్‌లు కూడా జాగ్రత్త‌గా ఉండాల‌ని, లేకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement