Thursday, March 28, 2024

పెళ్లి పేరుతో పైశాచికం – వేడి నూనె పోసి అత్యాచారం..

ఏలూరు ప్రభ న్యూస్‌ -కై-మ్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువెళ్లిన ప్రియురాలని కోరిక తీర్చమని వేధించడంతో తిరగబడింది. అది సహించలేని యువకుడు ఆమె కాళ్లు చేతులపై వేడినూనె పోసి చిత్రహింసలకు పాల్పడ్డాడు. ఆ తరువాత గదిలో నిర్బంధించి అత్యాచారం చేశా డు. అలా పద్నాలుగు రోజులు నరకం చూపిం చాడు. చివరకు బాధితురాలు చాకచక్యంగా తండ్రికి విషయం చెప్పడం, అతడు సమాచారమివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఏలూరు నగరం లోని మూడో పట్టణ పరిధి లోని దుగ్గిరాల ప్రాంతా నికి చెందిన యువతి కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెకు తల్లి, తండ్రి, ఒక సోదరి ఉన్నారు. తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే దుగ్గిరాల ప్రాంతానికి చెందిన ఎస్‌. అనుదీప్‌తో ఆమెకు నాలుగేళ్ల క్రితం పరిచయ మైంది. అప్పటినుంచి వీరు ప్రేమించుకుంటు-న్నా రు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన అనుదీప్‌ ఆమెకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడి మాటలను నమ్మిన ఆమె అంగీకరించింది. అదేరోజు ఆమెను కాకినాడ నుండి ఏలూరు నగరానికి తీసుకుని వచ్చాడు. నేరుగా తన ఇంటికి తీసుకువెళ్లి అక్కడ ఆమెను ఉంచాడు.

రాత్రి సమయంలో కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె నిరా కరించింది. మరుసటి రోజు 10వ తేదీన మద్యం సేవించిన అనుదీప్‌ ఆమెను కోరిక తీర్చాలని మరోసారి బలవం తం చేశాడు. ఆమె మాట వినకపోవడంతో వేడి నూనె ఆమె కాళ్లు చేతులపై పోశాడు. బాధతో విలవిలలాడుతున్న ఆమెపై అత్యాచారం చేశాడు. దాదాపు 14 రోజులపాటు- గదిలో బంధించి ఉంచాడు. ఆదివారం ఉదయం ఆమెను చంపేస్తానని బెదిరించి గొంతు నులిమేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమె అతడి నుండి తప్పించుకుని తండ్రికి ఫోన్‌ చేసింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి అక్క‌డికి వ‌చ్చి ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మూడో పట్టణ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అనుదీప్‌ పై హత్యాయత్నం, అత్యాచారం, నిర్బంధించటం, దాడి చేయడంపై వంటి అభియోగాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుదీప్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు- సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement