Friday, March 29, 2024

అంత‌ర్జాతీయ విమానాలపై నిషేధం – ఫిబ్ర‌వ‌రి 28వ‌ర‌కు పొడిగింపు

మ‌రోసారి అంత‌ర్జాతీయ విమానాల నిషేదాన్ని ఫిబ్ర‌వ‌రి 28వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ప్ర‌క‌టించింది. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునే క్ర‌మంలో అంత‌ర్జాతీయ విమానాల‌ను ర‌ద్దు చేశారు. అన్ని విమానాలు ఎయిర్ బబుల్ అగ్రిమెంట్స్, మిషన్ వందే భారత్ కు అనుగుణంగా ఆపరేట్ చేస్తామని వెల్ల‌డించారు. ముందుగా అనుకున్నట్లే కార్గో విమాన సర్వీసులు కొనసాగుతాయి. 2021 నవంబర్ 26న అనుకున్న విమానాల రద్దును పొడిగిస్తున్నామ‌ని చెప్పారు. డిసెంబర్ 1న చేసిన ప్రకటనలో మరో వారంలో సర్వీసులు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పుట్టిస్తున్న నేపథ్యంలో మరో నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తొలిసారి అంతర్జాతీయ విమాన సర్వీసులను 2020 మార్చి 23 నుంచి నిలిపేశారు. జులై 2020 న ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్ తో విమానాలను నడపాలని నిర్ణయించుకున్నారు. ఇండియాతో పాటు యూఎస్, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ దేశాలు కూడా ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్ పాటిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement