Thursday, March 28, 2024

కారుని తాకినందుకు పండ్ల వ్యాపారిపై విరుచుకుప‌డిన మ‌హిళ – ఏం చేసిందంటే

రోడ్డు అన్నాక మ‌నిషికి మ‌నిషి త‌గ‌ల‌డం లేదా కార్ల‌ని తోపుడు బండ్లు రాసుకోవ‌డం మామూలే. పొర‌పాటున ఓ పండ్ల వ్యాపారి బండి ఓ కారుకి త‌గిలింది. దాంతో కారులోని మ‌హిళ పండ్ల వ్యాపారిపై విరుచుకుప‌డింది. అంతేకాదు వ్యాపారి అమ్ముతోన్న బొప్పాయి పండ్ల‌ని మొత్తాన్ని నేల‌కేసి కొట్టింది. ప‌లువురు ఆమెని నిల‌దీయ‌గా త‌న కారుని డ్యామేజ్ చేసినందుకే తాను ప్ర‌తీకారంగా ఇలా చేశాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. కాగా.. తన పండ్లు నాశనం చేయవద్దని సదరు పండ్ల వ్యాపారి ఆమెను ఎంత వేడుకున్నా.. ఆమె మాత్రం ఆగలేదు. పండ్లను రోడ్డు మీద విసిరికొడుతూనే ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ భూపాల్ లోని అయోధ్య‌న‌గ‌ర్ లో జ‌రిగింది. ఆ మ‌హిళ ఓ ప్రైవేట్ యూనివ‌ర్శిటీలో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేస్తుంద‌ని స‌మాచారం. ప్రొఫెస‌ర్ అయి ఉండి ఆమె ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నెటిజ‌న్లు మండి ప‌డుతున్నారు. ఓ చిరు వ్యాపారిపై ఇంత‌టి కోప‌మా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital
Advertisement

తాజా వార్తలు

Advertisement