Saturday, April 20, 2024

క్రికెట‌ర్ ధోనీ నిర్మాణంలో – త‌మిళ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌

స్పోర్ట్స్ రంగం నుంచి ఎక్కువ‌గా సినిమాల వైపు ఆకర్షితులు అవుతున్నారు ప‌లువురు స్టార్స్. ఇప్పటికే చాలా మంది స్పోర్డ్స్ పర్సన్స్ ఈ రంగంలో రాణించగా.. ఇప్పుడు మరికొంత మంది సినీమా వైపు రావడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే త‌ర‌హాలో నిర్మాత‌గా మార‌నున్నారు స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. అది కూడా తమిళ ఫిలమ్మ్ ఇండస్ట్రీ నుంచి సినిమా నిర్మించబోతున్నట్టు సమాచారం. ధోనీ నిర్మాణ సంస్థలో రాబోయే ఆ తొలి సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేశార‌ట‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం. ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ద్వారా తమిళ అభిమాన గణాన్ని పెంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ అభిమాన బలగాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమ‌వుతున్నారు. అయితే ధోనీ నిర్మాత, నయన తార లీడ్ రోల్ అయితే మరి డైరెక్టర్ ఎవరు అన్నదానిపైమాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు. నయనతార లీడ్ రోల్ కాబట్టి.. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ అని అర్దం అయిపోతోంది. కాని సినిమాకు కథ ఎవరు ఇస్తున్నారు. డైరెక్ట్ ఎ వరు అనేది త్వరలో అనౌన్స్ చేయబోతున్నార‌ట‌. గతంలో ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దిశా పటానీ, కియారా అద్వానీల కాంబోలో ఎంఎస్ ధోనీ–ద అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ సూపర్ సక్సెస్ అందుకుంది. మ‌రి నిర్మాత‌గా ధోనీ సినీప‌రిశ్ర‌మ‌లో ఏ మేర‌కు రాణిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement