Thursday, April 25, 2024

భారత రెజ్లర్‌కు బంగారు పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలవగా.. ఆదివారం మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఆదివారం నాడు భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం క్రియేట్ చేసింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హంగేరీలో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: మీరాబాయికి డామినోస్ సంస్థ బంపర్ ఆఫర్

Advertisement

తాజా వార్తలు

Advertisement