Saturday, April 20, 2024

సూర్యాపేటలో ప్రైవేట్ బస్సు బోల్తా, 15 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ‌లంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంజలూరు సమీపంలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌న్వి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న‌ 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానికుల స‌హాయంతో ద‌వాఖాన‌కు తరలించారు. బ‌స్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement