Thursday, March 28, 2024

రెండో ద‌శలో క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది: మోదీ

రెండో ద‌శలో క‌రోనా వేగంగా విస్త‌రిస్తోందని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌న్ కీ బాత్‌లో ఆయ‌న మాట్లాడుతూ మొద‌టి ద‌శ క‌రోనాను విజ‌య‌వంతంగా ఎదుర్కోగ‌లిగామ‌ని తెలిపారు. రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తాము తీసుకోవాల్సిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. సామాజిక మాధ్య‌మాల ద్వారా క‌రోనాపై వైద్యులు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డికి రాష్ట్రాల‌కు స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రాల ప్ర‌య‌త్నాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర స‌ర్కారు స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. కరోనాపై పోరులో తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ సేవలందిస్తున్న వైద్యారోగ్య సిబ్బందిని ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా అభినందించారు. పలువురు వైద్యులు, నర్సులు, అంబులెన్సు డ్రైవర్ల కృషిని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement