Friday, March 29, 2024

Breaking: వైఎస్ ష‌ర్మిల‌కు ప్ర‌ధాని మోడీ ఫోన్

ప్రధాని న‌రేంద్ర‌ మోడీ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్టు సమాచారం. ఇటీవల పాదయాత్ర సందర్భంగా షర్మిలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఘటనకు నిరసనగా ధ్వంసమైన తన కారులో ఆమె ప్రగతి భవన్ కు బయల్దేరగా… ఆమె కారులో ఉండగానే వాహనాన్ని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో, షర్మిలను ప్రధాని ఫోన్ ద్వారా పరామర్శించినట్టు తెలుస్తోంది. ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ఢిల్లీకి రావాలని ఆమెకు సూచించారు. తనకు అండగా నిలిచి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement