Friday, March 29, 2024

ప్రారంభమైన ప్రధాని మోడీ మెగా రోడ్ షో

కర్ణాటకలో వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో మెగా రోడ్​ షో నిర్వహిస్తున్నారు. సోమేశ్వర్‌భవన్‌ ఆర్‌బీఐ గ్రౌండ్‌ నుంచి మల్లేశ్వరంలోని సాంకి ట్యాంక్‌ వరకు 26.5 కిలోమీటర్ల మేర రోడ్‌ షో సాగనుంది. ప్రధాని మోదీ రోడ్ షోకు ప్రజల నుంచి విశేషణ స్పందన లభిస్తుంది. దారి పొడుగున బీజేపీ శ్రేణులు, ప్రజలు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తున్నారు. మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో బెంగళూరు నగరంలో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు.

బెంగళూరు సౌత్‌లోని సోమేశ్వర్ భవన్ ఆర్‌బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరంలోని సాంకీ ట్యాంక్ వరకు రోడ్‌షో కొనసాగనుంది. దాదాపు మూడున్నర గంటల్లో రోడ్ షో పూర్తి అవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ రోడ్ షో.. దక్షిణ, మధ్య బెంగళూరులోని కొన్ని ప్రాంతాల గుండా వెళుతుందని, 12 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తుందని బీజేపీ నేతలు చెప్పారు. ఇక, ప్రధాని వెంట బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement