Thursday, April 25, 2024

గుజరాత్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‎లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. బరిలో 833 మంది అభ్యర్థులుండగా 2.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరోవైపు అహ్నదాబాద్ లో ప్రధాని మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 89 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 1న పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement