Thursday, April 25, 2024

ఉక్రెయిన్.. ర‌ష్యా యుద్దం ఆగిపోవాల‌ని హ‌రిద్వార్ లో పూజ‌లు

హ‌రిద్వార్ లో పూజ‌లు చేశారు ర‌ష్య‌న్లు. ఈ బృందంలోని 24 మంది రష్యన్లు గంగానదిలో పవిత్ర స్నానం చేసి, ఉక్రెయిన్ ..రష్యా యుద్ధం ఆగిపోవాలని పూజలు చేశారు. ఈమేరకు కంఖాల్ లోని రాజ్ ఘాట్ లో హిందూ ఆచారాల ప్రకారం గంగను పూజించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించారు.రెండు దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు ఆయా దేశాల పౌరులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ బృందం ప్రయత్నం అద్దం పడుతోంది. ఈ పూజల కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా వచ్చామని, హిందూ ఆచారాలపై నమ్మకంతో పాటిస్తున్నామని వారు తెలిపారు. అందుకే హరిద్వార్ లో పూజలు చేశామని రష్యన్ల బృందం నాయకుడు తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. ఏడాది పూర్తయినా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement