Friday, April 19, 2024

కాంగ్రెస్ నేత రాణేకు శాశ్వత కేబినెట్ హోదా: గోవా బీజేపీ సర్కార్

గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ రాణె విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు శాశ్వత కేబినెట్ మంత్రి హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు.

గోవా అసెంబ్లీలో ప్రస్తుత పదవీకాలంలో రాణే శాసనసభ్యుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఆయనకు ఈ గౌరవం ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. గోవా రాష్ట్రానికి రాణె అందించిన గొప్ప సేవలను గుర్తిస్తూ జీవిత కాలం పాటు కేబినెట్ హోదా ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేగా 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులు, మాజీ స్పీకర్ లకు భవిష్యత్తులోనూ ఈ హోదా ఇవ్వనున్నట్టు సీఎం సావంత్ ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల రాణె కుమారుడు, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో వైద్య మంత్రిగా ఉన్న విశ్వజిత్ ధన్యవాదాలు తెలిపారు.

కాగా, 87 ఏళ్ల రాణె 1987 నుంచి 2007 మధ్య నాలుగు పర్యాయాలు గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. స్పీకర్ గానూ పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోరియం అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -


Advertisement

తాజా వార్తలు

Advertisement