Thursday, April 18, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పీకే.. మరి జగన్ సంగతేంటి?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో మంగళవారం ప్రశాంత్ కిశోర్ సమావేశమైన సంగతి తెలిసిందే. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు, 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలపై వీరు చర్చించారని చెప్తున్నా.. అంతకుమించి ఏదో జరగబోతోందని కాంగ్రెస్ పార్టీ వర్గాలే అంటున్నాయి.

2024 ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను ప్రశాంత్ కిషోర్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి వ్యూహకర్తగా పని చేసిన పీకే.. ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మాట్లాడుతూ… ఇకపై తాను వ్యూహకర్తగా పని చేయబోనని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నకు బదులుగా… తానొక విఫల నేతనని చెప్పారు. గతంలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్… ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీలో జగన్ పార్టీ పరిస్ధితి ఏంటన్న అనుమానాలు పలువురిలో రేకెత్తుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర అందరికీ తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న జగన్‌కు ప్రశాంత్ కిషోర్ అండదండలు అవసరమే. మరి ప్రశాంత్ కిషోర్ సహాయం లేకుండా 2024 ఎన్నికలకు జగన్ సమాయత్తమవుతారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

ఈ వార్త కూడా చదవండి: ప్రశాంత్ కిషోర్‌తో రాహుల్ గాంధీ చర్చలు

Advertisement

తాజా వార్తలు

Advertisement