Saturday, April 20, 2024

ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో కేసీఆర్ ని క‌లిసిన కేర‌ళ సీఎం ‘పిన‌ర‌యి విజ‌య‌న్’

సీపీఎం కేంద్ర క‌మిటీ స‌మావేశాలు హైద‌రాబాద్ లో జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూడా పాల్గొంటున్నారు. న‌గ‌రానికి వ‌చ్చిన కేర‌ళ సీఎంను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఆయ‌న‌ని భోజ‌నానికి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ని , పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో క‌లిశారు. విజ‌య‌న్ వెంట సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి,సీపీఎం అగ్ర‌నేత ప్ర‌కాశ్ కార‌త్ లు కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement