Sunday, March 24, 2024

Radhe Shyam: కర్నూలులో విషాదం.. ప్రభాస్ అభిమాని ఆత్మహత్య!

కర్నూలులోని తిలక్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. తన అభిమాన హీరో సినిమా బాగా లేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని యువకుడు రవితేజ(24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్లితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా రాధేశ్యామ్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. దీంతో ప్రభాస్ అభిమాని రవితేజ మనస్తాపం చెందాడు. సినిమా బాగాలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లితో చెప్పి మరీ రవితేజ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement