Friday, April 19, 2024

గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా..

హైదరాబాద్‌ : తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 ఉద్యోగాలకు నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేసినట్లు వెల్లడించింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. త్వరలో గ్రూప్‌-2, 3 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు TSPSC కసరత్తు పూర్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement