Tuesday, April 23, 2024

రాజ‌కీయ పార్టీని స్థాపిస్తా .. బీసీల కోసం ప‌ని చేస్తా .. ఆనంద‌య్య ..

ఆనంద‌య్య గుర్తున్నారా .. క‌రోనా స‌మ‌యంలో ఈయ‌న పేరు మారు మోగింది. క‌రోనా నివార‌ణ‌కి ఆయుర్వేద మందుని క‌నిపెట్టాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ సంగ‌తి మ‌రుగున ప‌డిపోయింది. ఇప్పుడు మ‌రో అంశంతో వార్త‌ల్లో నిలిచారు ఆనంద‌య్య‌.. రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌నే వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి. పార్టి స్థాపన పై క్లారిటీ కూడా ఇచ్చారు. త్వరలోనే బీసీలకోసం రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్టు ఆనందయ్య వెల్ల‌డించారు.

విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ….కరోనా మూడు దశలను ఎదుర్కొనేందుకు తన వద్ద మందు ఉంద‌న్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఆ మందును పంచిపెడ‌తాన‌ని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం బీసీలను విస్మరిస్తోందన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తానని…బీసీ జేఏసీని కలుపుని పనిచేస్తానని ఆనంద‌య్య చెప్ప‌డం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాన‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement