Sunday, April 14, 2024

రాజకీయ విశ్లేషకులు మురళీ మోహన్‌రావు హఠాన్మరణం

రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన్‌రావు ఆదివారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని బలంగా సమర్థించిన ఇలపావులూరి.. పత్రికల్లో వ్యాసాలు, ఫేస్ బుక్ పోస్టుల ద్వారా కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మురళీ మోహన్ రావు.. అద్దంకిలో ఉండగానే అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన ఒంగోల్‌లోని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement