Tuesday, April 23, 2024

అంబులెన్స్ లో రూ.25.80కోట్ల ఫేక్ క‌రెన్సీ-స్వాధీనం చేసుకున్న పోలీసులు

అంబులెన్స్ లో త‌ర‌లిస్తున్న రూ.25.80కోట్ల ఫేక్ క‌రెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్లను తరలిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..ఆ వాహనాన్ని అడ్డగించి ఆరు పెట్టెల్లో, 2000 రూపాయల నోట్ల కట్టలు (1,290కట్టలు)ను సీజ్ చేశారు. అయితే, ఆ కరెన్సీపై ‘రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించి ఉండడం గమనార్హం.
ఈ అంశంమీద స్థానిక ఎస్పీహితేశ్ జోయ్ సర్ మీడియాతో మాట్లాడారు. అంబులెన్స్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నోట్లు ఎక్కడ అచ్చు వేశారు.. ఎక్కడికి ఇక్కడికి తీసుకు వెడుతున్నారో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సైతం ఆధారాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement